విద్యుత్‌ తీగలు ట్రాక్టర్‌కు తగిలి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-04-24T04:15:01+05:30 IST

విద్యుత్‌ తీగలు ట్రాక్టర్‌కు తగిలి వ్యక్తి మృతి

విద్యుత్‌ తీగలు ట్రాక్టర్‌కు తగిలి వ్యక్తి మృతి

మొయినాబాద్‌ రూరల్‌: పొలం దున్నుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌కు విద్యుత్‌ తీగలు తగలడంతో తీవ్రగాయాలై చికిత్స పొందుతూ వ్యక్తి మృతిచెందిన ఘటన మండల పరిధిలోని శ్రీరాంనగర్‌ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గత శనివారం మానుక శ్రీపాల్‌ అనే వ్యక్తి ట్రాక్టర్‌తో పొలం దున్నుతుండగా విద్యుత్‌ తీగలు తగిలి ట్రాక్టర్‌ దగ్ధమవ్వగా శ్రీపాల్‌కు తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం మృతి చెందాడు. కాగా శ్రీపాల్‌కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని, తగిన న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, కుటుంబీకులు ప్రభుత్వాన్ని కోరారు.


Updated Date - 2021-04-24T04:15:01+05:30 IST