పిడుగు పడి వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-05-10T05:03:54+05:30 IST
పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన గొల్లపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది.
సీతానగరం(బొబ్బిలి), మే 9: పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన గొల్లపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు అందించిన వివరాల ప్రకారం.. గ్రామాని కి చెందిన పైల రమణ (42) అనే వ్యక్తి తన పశువులను ఆది వారం వెంగలరాయ చెరువు సమీప పొలంలో మేతకు తీసుకె ళ్లాడు. సాయంత్రం గాలివానతో వర్షం కురిసింది. తన సమీ పంలో పిడుగు పడడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందా డు. దీంతో గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు.