చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-06-27T06:36:32+05:30 IST

చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వాగులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. నల్లగొం డ జిల్లా చండూరు మునిసిపాలిటీ పరిధిలోని అంగడిపేటలో ఆదివారం ఈ సంఘటన జరిగింది.

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
మృతుడు నర్సింహ (ఫైల్‌ఫొటో)

చండూరు, జూన 26: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వాగులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. నల్లగొం డ జిల్లా చండూరు మునిసిపాలిటీ పరిధిలోని అంగడిపేటలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. కుటుంబ స భ్యుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. అంగడిపేట గ్రామానికి చెందిన పెదగోని నర్సింహ(55) చం డూరు బీసీ బాలుర వసతిగృహంలో క్టాంట్రాక్టు పద్ధతిన వంట మనిషిగా పని చేస్తున్నాడు. నర్సింహ ఆదివారం అంగడిపేట గ్రామశివారులో ఉన్న వాగులో వలతో చేప లు పట్టడానికి వెళ్లాడు. వల విసిరే సమయంలో నిలువరించుకోలేక ప్రమాదవశాత్తు వాగులో పడ్డాడు. వలలో చిక్కుకుని మృతి చెందాడు. ఆ ప్రాంతంలో పశువులు కాసేందుకు వచ్చిన వ్యక్తి వలలో చిక్కుకొని మృతి చెందిన నర్సింహను గుర్తించి గ్రామస్థులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నర్సింహకు భార్య గోపమ్మ, కుమారు డు, కుమార్తె ఉన్నారు. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ నవీనకుమార్‌ పరిశీలించారు. పంచనా మా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ నవీనకుమార్‌ తెలిపారు.


Updated Date - 2022-06-27T06:36:32+05:30 IST