ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-04-18T06:28:11+05:30 IST
మండలంలోని టీడీపల్లి గ్రామ సమీపంలో వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
రొళ్ల, ఏప్రిల్ 17: మండలంలోని టీడీపల్లి గ్రామ సమీపంలో వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ మగ్బుల్బాషా అందించిన వివరాలిలా ఉన్నాయి. మడకశిర మండలం వడ్రపాళ్యం గ్రామానికి చెందిన పుట్టన్న(38) మతిస్థిమితం లేక తాగుడుకు బానిసై ఉండేవాడని తెలిపారు. గత మూడు రోజుల క్రితం టీడీపల్లి గ్రామంలో తన బంధువుల ఇంటికి వచ్చాడు. శ నివారం గ్రామ సమీపంలో పొలంలోని చింతచెట్టుకు పంచెతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుని భార్య శాంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు