గుండు మీద పడి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-03-01T04:43:20+05:30 IST

గుండు మీద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఊర్కొండపేట వివారులోని హను మాండ్ల గుట్టపై ఆదివారం చోటు చేసుకుంది.

గుండు మీద పడి వ్యక్తి మృతి

ఊర్కొండ, ఫిబ్రవరి 28: గుండు మీద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఊర్కొండపేట వివారులోని హనుమాండ్ల గుట్టపై ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ విజయ్‌ కుమార్‌ తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని రామనుంతాపూర్‌ గ్రామానికి చెందిన నాగరాజు (45) జీవనోపాధి కోసం మండలంలోని ఊర్కొండపేటకు వలస వచ్చాడు. ఊర్కొండపేట శివారులోని గుట్టపై పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. ఆదివారం ఉదయం గుట్టపైకి వెళ్లి పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు గుండు మీద పడి అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య పారిజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ పేర్కొన్నారు. మృతు డికి ఇద్దరు కుమారులు ఉన్నట్లు తెలిపారు.



Updated Date - 2021-03-01T04:43:20+05:30 IST