బహిర్భూమికి వెళ్లిన వ్యక్తి చెరువులో పడి మృతి

ABN , First Publish Date - 2021-02-28T05:25:29+05:30 IST

బహిర్భూమికని వెళ్లి మూర్ఛ వ్యాధితో ఓ వ్యక్తి చెరువులో పడి మృతి చెందిన సంఘటన శనివారం మండలంలోని పెద్దగుండవెళ్లిలో చోటు చేసుకుంది.

బహిర్భూమికి వెళ్లిన వ్యక్తి చెరువులో పడి మృతి

దుబ్బాక, ఫిబ్రవరి 27: బహిర్భూమికని వెళ్లి మూర్ఛ వ్యాధితో ఓ వ్యక్తి  చెరువులో పడి మృతి చెందిన సంఘటన శనివారం మండలంలోని పెద్దగుండవెళ్లిలో చోటు చేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం...గ్రామానికి చెందిన పంజా కిషన్‌(32) గ్రామంలోని సాక్షిచెరువులో బహిర్భూమికని వెళ్లాడు. మూర్భ వ్యాధి వచ్చి ఒక్కసారిగా చెరువులో బొక్కబోర్లపడడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలిపారు. మృతదేహాన్ని దుబ్బాక కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య లత, కొడుకు జశ్వంత్‌ ఉన్నారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. 


Updated Date - 2021-02-28T05:25:29+05:30 IST