భూ ఆక్రమణల వెనుక మంత్రి హస్తం

ABN , First Publish Date - 2022-05-29T06:07:51+05:30 IST

భూ ఆక్రమణల వెనుక మంత్రి హస్తం

భూ ఆక్రమణల వెనుక మంత్రి హస్తం


  • ప్రభుత్వ భూములను అక్రమిస్తున్న మల్లారెడ్డి
  • టీఆర్‌ఎస్‌ నాయకులు దాడులు చేస్తే ప్రతిదాడులు చేస్తాం
  • విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు

ఘట్‌కేసర్‌, మే 28 : మేడ్చల్‌ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి అవినీతి, అక్రమాలకు అడ్డుఅదుపు లేకుండా పోయిందని, భూ ఆక్రమణల వెనుక మంత్రి హస్తం ఉంటోందని టీపీసీసీ లీగల్‌సెల్‌ సంయుక్త కార్యదర్శి పాలడుగు అమరేందర్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు కర్రె రాజే్‌ష ఆరోపించారు. శనివారం చౌదరిగూడ వెంకటాద్రి టౌన్‌షి్‌పలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలన్ని మంత్రి మల్లారెడ్డి అండదండలతోనే జరుగుతున్నాయని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ నాయకులపై దాడులు చేస్తామని హెచ్చరికలు చేస్తున్నారని, తాము ఎదురుదాడులకు సిద్ధంగా ఉన్నామని సవాల్‌ చేశారు. కాచవానిసింగారం, చౌదరిగూడతోపాటు అన్ని గ్రామాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులకు పలు మార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న పాపాన పోవడంలేదని మండిపడ్డారు. జడ్పీచైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డికి ఉన్న జ్ఞానం కూడా మంత్రి మల్లారెడ్డికి లేకపోవడం విచాకరమన్నారు. ఇప్పుడు టీఆర్‌ఎ్‌సలో ఉన్న నాయకులంతా ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీలో ఉండే అసమర్ధులేనని ఎద్దేవా చేశారు. మండలంలో ఒక్క పార్కును కూడా కాపాడలేని అసమర్ధ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి మంత్రికి భజన చేస్తూ కాలం గడుపుతున్నాడని వారు విమర్శించారు. ఈ సమావేశంలో ఎంపీటీసీ పులకంటి భాస్కర్‌రెడ్డి, కట్ట ఆంజనేయులు, పల్లె బాబురావు, బోజిరెడ్డి, సుధాకర్‌, వినోద్‌, అనిల్‌, నాగేష్‌ భాస్కర్‌, దావిద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-29T06:07:51+05:30 IST