ప్రజల్లో తిరగలేకే మంత్రుల బస్సు యాత్ర

ABN , First Publish Date - 2022-05-24T06:50:11+05:30 IST

వైసీపీ మంత్రులు ప్రజల్లో తిరిగే ధైర్యం లేకే బస్సు యాత్ర చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీలా గోవింద సత్యనారాయణ ఆరోపించారు.

ప్రజల్లో తిరగలేకే మంత్రుల బస్సు యాత్ర
ఉపాధి కూలీలకు కరపత్రాలను అందిస్తున్న పీలా

మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ


కొత్తూరు, మే 23 : వైసీపీ మంత్రులు ప్రజల్లో తిరిగే ధైర్యం లేకే బస్సు యాత్ర చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీలా గోవింద సత్యనారాయణ ఆరోపించారు. మండలంలోని కొత్తూరు, సత్యనారాయణపురం పంచాయతీల్లో సోమవారం బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని ప్రజలు, ఉపాధి పథకంలో పనులు చేస్తున్న కూలీలను కలిసి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు నాడు ముద్దులు పెట్టి, నేడు వారిపై గుద్దులు గుద్దుతున్నారని చెప్పారు. అభివృద్ధిపై ప్రజలు ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. రెండుపూటలా ఉపాధి కూలీలకు పని కల్పించి పలు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గడపగడపకూ వస్తున్న వైసీపీ నాయకులను ప్రజలంతా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కొణతాల శ్రీనివాసరావు, నడిపల్లి గణేశ్‌, మేడిశెట్టి నూకరాజు, మాజీ సర్పంచ్‌ మేడిశెట్టి రాధా, ఎంపీటీసీ మాజీ సభ్యులు కోన శ్రీను, గైపూరి సూర్య చక్రక్రాంతి, గ్యాస్‌ అప్పారావు, జోగా భాను, చిన్నినాయుడు, కోరాడ మహేశ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-24T06:50:11+05:30 IST