తప్పిపోయిన చిన్నారి

ABN , First Publish Date - 2021-07-27T05:06:56+05:30 IST

మతిస్థిమితం లేని 4 సంవత్సరాల చిన్నారి తప్పిపోవడంతో వెంటనే బాలుడి మేనమామ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

తప్పిపోయిన చిన్నారి

5 నిమిషాల్లో మేనమామ వద్దకు చేర్చిన పోలీసులు 

పుల్లంపేట, జూలై 26 : మతిస్థిమితం లేని 4 సంవత్సరాల చిన్నారి తప్పిపోవడంతో వెంటనే బాలుడి మేనమామ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 5 నిమిషా ల్లోనే బాలుడిని మేనమామ వద్దకు చేర్చినట్లు పుల్లంపేట ఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి తెలిపారు.  మండల పరిధిలోని బాషావాండ్లపల్లెకు చెందిన లోకేష్‌కు మతిస్థిమితం లేదని మాటలు కూడా సక్రమంగా రావన్నారు. సోమవారం తన మేనమామతో కలిసి ఆటోలో పుల్లంపేటకు వచ్చి తప్పిపోయాడు. అతడి మేనమామ పోలీ్‌సస్టేషన్‌ ఫిర్యాదు చేశాడు. వెంటనే హెడ్‌ కానిస్టేబుల్‌ సుధాకర్‌రాజు, కానిస్టేబుల్‌ మనోజ్‌ బైకులో గాలించగా బైపాస్‌ రోడ్డులో వెళుతున్న బాలుడిని తెచ్చి మేనమామకు అప్పజెప్పమని ఎస్‌ఐ తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాలుడిని వారి కుటుంబ సభ్యులకు చేర్చామన్నారు. 

Updated Date - 2021-07-27T05:06:56+05:30 IST