నిర్వాసితుల సమస్యలపై ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి లేదు

ABN , First Publish Date - 2022-05-29T05:34:59+05:30 IST

నిర్వాసితుల సమస్యలపై మంథని ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి లేదని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు ఆరోపించారు.

నిర్వాసితుల సమస్యలపై ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి లేదు
విలేకరులతో మాట్లాడుతున్న జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు

- జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు

రామగిరి, మే 28: నిర్వాసితుల సమస్యలపై మంథని ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి లేదని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు ఆరోపించారు. శనివారం రామగిరి అతిథిగృహంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్వాసితుల సమస్యలపై కలెక్టర్‌ దేవసేనకు సిఫారసు చేశానని ఎమ్మెల్యే అంటున్నారని, 2020 ఫిబ్రవరి నెలలో దేవసేన బదిలీ వెళ్లారని పేర్కొన్నారు. గత రెండేళ్లలో నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ఏచర్యలు తీసుకున్నారో స్పష్టం చేయాలన్నారు. నిర్వాసితుల ఆర్‌అండ్‌ ఆర్‌పై ఎమ్మెల్యేకు పరిజ్ఞానం లేదన్నారు. లద్నాపూర్‌ గ్రామానికి చెందిన 283 మంది కి ఏం న్యాయం చేస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీపై చిత్త శుద్ధి ఉంటే ఇన్ని సంవత్సరాలుగా అధికారులపై ఒత్తిడి ఎందుకు తేలేదని ప్రశ్నించా రు. ఈ సమావేశంలో జడ్పీటీసీ మ్యాదరవేని శారద, ఎంపీపీ ఆరెల్లి దేవక్క, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పూదరి సత్యనారాయణగౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శంకేషి రవీందర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-29T05:34:59+05:30 IST