రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు మొర

ABN , First Publish Date - 2022-08-08T05:15:16+05:30 IST

మండలంలోని వెంకయ్యపాలెం, గోవిందపురం గ్రామాలలో డ్రైనేజీలు, రోడ్లు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌ను కోరారు.

రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు మొర
వెంకయ్యపాలెంలో సమస్యలు వింటున్న ఎమ్మెల్యే గణేశ్‌


నాతవరం, ఆగస్టు 7 : మండలంలోని వెంకయ్యపాలెం, గోవిందపురం గ్రామాలలో డ్రైనేజీలు, రోడ్లు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌ను కోరారు. ఆదివారం మండలంలోని జిల్లేడిపూడి పంచాయతీ శివారు, గోవిందపురం, వెంకయ్యపాలెం గ్రామాలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దీంతో గ్రామస్థులు గోవిందపురం, వెంకయ్యపాలెం గ్రామాలలో రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయగాలని కోరగా దశలవారీగా పరిష్కరిస్తానన్నారు. సొంతస్థలం ఉన్న వారికి జగనన్న ఇళ్లు మంజూరు చేస్తే తాము ఇళ్లు కట్టుకుంటామని ఎమ్మెల్యే గణేశ్‌ను కోరగా.. అధికారులతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరిస్తానన్నారు. అలాగే ఎమ్మెల్యే గణేశ్‌ ఇంటింటికి వెళ్లి అర్హులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు కాపారపు అప్పలనర్స, మండల పార్టీ అద్యక్షులు పైల పోతురాజు, వైసీపీ మండల మహిళ అధ్యక్షురాలు కామిరెడ్డి లక్ష్మీ, మండల వైస్‌ ఎంపీపీ పైల సునీల్‌, మాజీ సర్పంచ్‌ లాలం లోవ, వైఎస్‌ఆర్‌ యూత్‌ మండల అధ్యక్షులు బండారు నాయుడు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-08T05:15:16+05:30 IST