ఎమ్మెల్సీ ఎన్నికను పకడ్బందీగా నిర్వహించాలి
ABN , First Publish Date - 2021-03-01T04:21:49+05:30 IST
ఎమ్మెల్సీ ఎన్నికను పకడ్బందీగా నిర్వహించాలి
వికారాబాద్ కలెక్టర్ పౌసుమి బసు
వికారాబాద్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని వికారాబాద్ కలెక్టర్, ఎన్నికల అధికారి పౌసుమిబసు అన్నారు. వికారాబాద్లోని డీపీఆర్సీ భవనంలో ఎన్నికల సిబ్బంది పీవోలు, ఏపీవోలకు ఆదివారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని అన్నారు. ఎలాంటి పొరపా ట్లు జరగకుండా విధులు నిర్వహించాలని కోరారు. అనంతరం విధుల్లో పాల్గొననున్న సిబ్బందికి బ్యాలెట్ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, డీఆర్డీవో కృష్ణన్, ఆర్డీవో ఉపేందర్రెడ్డి పాల్గొన్నారు.