అర్ధరాత్రి కేకలు.. కంగారుగా వెళ్లిన ఆ తల్లికి కనిపించిందో షాకింగ్ సీన్.. కొడుకు శవం పక్కనే నిల్చున్న కోడల్ని చూసి..

ABN , First Publish Date - 2022-03-03T00:29:17+05:30 IST

భార్యాభర్తలు అన్నాక గొడవలు జరగడం, మళ్లీ కలిసిపోవడం.. సాధారణంగానే జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే భార్యాభర్తల విషయంలో ఇందుకు విరుద్ధంగా జరిగింది...

అర్ధరాత్రి కేకలు.. కంగారుగా వెళ్లిన ఆ తల్లికి కనిపించిందో షాకింగ్ సీన్.. కొడుకు శవం పక్కనే నిల్చున్న కోడల్ని చూసి..

మద్యం మత్తులో కన్నూమిన్నూ కానక.. హత్యలు, అత్యాచారాలకు పాల్పడే వారిని చాలా మందిని చూశాం. కనీసం బాలికలు అని కూడా చూడకుండా తమ రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తుంటారు. సాధారణంగా ఇలాంటి ఘటనల్లో మహిళలే ఎక్కువగా బలవుతుంటారు. అయితే రాజస్థాన్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తలు అన్నాక గొడవలు జరగడం, మళ్లీ కలిసిపోవడం.. సాధారణంగానే జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే భార్యాభర్తల విషయంలో ఇందుకు విరుద్ధంగా జరిగింది. ఆ దంపతులు ఇద్దరూ అర్ధరాత్రి మద్యం సేవించి మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో వారి మధ్య జీతం విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. కొడుకు కేకలు విని తల్లి కంగారుగా అక్కడికి వెళ్లింది. కొడుకు శవం పక్కనే నిల్చున్న కోడల్ని చూసి షాక్ అయింది. అసలు ఏం జరిగిందంటే..


రాజస్థాన్ రాష్ట్రం బార్మర్‌ పరిధి జాటియోలో అనిల్ కుమార్, మంజు దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఆరేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అనిల్ కుమార్ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ దంపతులిద్దరికీ మద్యం సేవించే అలవాటు ఉంది. దీంతో వచ్చే జీతం వీరికి ఖర్చులకే సరిపోయేది కాదు. మందు తాగే సమయంలో ఈ విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉండేది. మత్తు దిగాక మళ్లీ ఎవరి పనులు వారు చేసుకునేవారు. వీరి గురించి అనిల్ తల్లిదండ్రులు, స్థానికులకు తెలుసు కాబట్టి.. పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి దంపతులు ఇద్దరూ మందు తాగుతూ ఉన్నారు. ఈ సమయంలో మళ్లీ డబ్బుల విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ‘‘ నీ జీతం చాలా తక్కువగా వస్తోంది.. అసలు ఇంటి ఖర్చులకే సరిపోలేదు’’.. అంటూ భర్త మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇద్దరూ మద్యం మత్తులో ఉండడంతో ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కాలేదు.

మీ అమ్మాయి స్కూల్‌కు రావట్లేదంటూ టీచర్ల ఫిర్యాదు.. తల్లిదండ్రులు నిలదీస్తే ఆ బాలిక చెప్పింది విని..


భార్య మాటలకు ఆగ్రహించిన భర్త దుర్భాషలాడడం మొదలెట్టాడు. దీంతో మంజుకు కోపం కట్టలు తెచ్చుకుంది. ఒక్కసారిగా పైకి లేచి, భర్త బెల్టును లాక్కుని అతడి మెడకు గట్టిగా చుట్టింది. ఊపిరాడకపోవడంతో కొద్దిసేపు కొట్టుమిట్టాడిన భర్త.. తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. చాలా సేపటి నుంచి వీరి కేకలు వింటున్న అనిల్ తల్లి భయంతో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అక్కడికి వెళ్లింది. అయితే అప్పటికే అనిల్ కుమార్ నిర్జీవంగా పడి ఉన్నాడు. పక్కనే కోడలు నిల్చుని ఉండడం చూసి షాక్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. భార్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం అంగీకరించింది. అయితే భర్త మృతికి జీతం విషయంలో జరిగిన గొడవే కారణమా.. లేక వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఆ పని చేయకపోతే నీ వీడియోలు బయటపెడతా.. అంటూ హెచ్చరించిన భర్త.. ఈ వ్యవహారం చివరకు ఎంత వరకు వెళ్లిందంటే..

Updated Date - 2022-03-03T00:29:17+05:30 IST