యువకుడి దారుణ హత్య

ABN , First Publish Date - 2021-12-05T05:40:36+05:30 IST

నంద్యాల పట్టణంలోని నడిగడ్డలో శనివారం రాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.

యువకుడి దారుణ హత్య

నంద్యాల (నూనెపల్లె), డిసెంబరు 4: నంద్యాల పట్టణంలోని నడిగడ్డలో శనివారం రాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వన్‌టౌన్‌ పోలీసుల వివరాల మేరకు.. నడిగడ్డ వీధికి చెందిన గఫార్‌ హుసేన్‌ (30) ఎలక్ట్రీషియన్‌, లైటింగ్‌ డెకరేషన్‌ వృత్తితో జీవనం సాగించేవాడు. అయితే అదే వీధికి చెందిన జక్రియతో కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇరువురికి ఇంటి వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో జక్రియ కత్తితో గఫార్‌హుసేన్‌పై విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలతో కుప్పకూలిపోయాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే జక్రియ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు, స్థానికులు హుటాహుటిన గఫార్‌హుసేన్‌ను నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే గఫార్‌హుసేన్‌ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం జక్రియ వన్‌టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌లో లొంగిపోయాడు. గఫార్‌ హుసేన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



Updated Date - 2021-12-05T05:40:36+05:30 IST