కొత్త పీఆర్సీని రద్దు చేయాలి
ABN , First Publish Date - 2022-01-27T06:36:27+05:30 IST
కొత్త పీఆర్సీని రద్దుచేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అవుట్సోర్సింగ్ కార్మికులు ఆందోళన నిర్వహించారు.
శ్రీకాళహస్తి, జనవరి 26: కొత్త పీఆర్సీని రద్దుచేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అవుట్సోర్సింగ్ కార్మికులు బుధవారం స్థానిక అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఆందోళన నిర్వహించారు. సంఘ గౌరవాధ్యక్షుడు జనమాల గురవయ్య మాట్లాడుతూ పురపాలకసంఘ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు. కార్యక్రమంలో అవుట్సోర్సింగ్ కార్మిక సంఘ నాయకులు వెంకటేష్, కోగిల హరి, తిరుపాల్, కొండమ్మ తదితరులు పాల్గొన్నారు. పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో పట్టణ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. సమస్యలను పరిష్కరించాలని రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎన్జీవోల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రఘు, పలుసంఘాల నాయకులు చెంచురత్నం యాదవ్, భాస్కర్, సుబ్బారెడ్డి, ఆనంద్బాబు, సూర్యప్రకాష్, శ్రీనివాసులు, జయంతి, విజయశ్రీ, మురళి, కృష్ణయ్య, శాంతిదుర్గ, శ్రీనాథ్ పాల్గొన్నారు.