చెరువుల అభివృద్ధే లక్ష్యం

ABN , First Publish Date - 2022-08-18T05:01:28+05:30 IST

చెరువులను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం అమృత్‌ సరోవర్‌ పథకాన్ని ప్రవేశపెట్టిందని డ్వామా పీడీ మద్దిలేటి పేర్కొన్నారు. బుధవారం అనంతపురం ఈడిగపల్లె చెరువులో ఉపాధి హామీ పథకంలో భాగంగా అమృత్‌ సరోవర్‌ పనులను ఆయన పరిశీలించారు.

చెరువుల అభివృద్ధే లక్ష్యం
అమృత్‌ సరోవర్‌ పనులను పరిశీలిస్తున్న పీడీ

లక్కిరెడ్డిపల్లె, ఆగస్టు 17: చెరువులను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం అమృత్‌ సరోవర్‌ పథకాన్ని ప్రవేశపెట్టిందని డ్వామా పీడీ మద్దిలేటి పేర్కొన్నారు. బుధవారం అనంతపురం ఈడిగపల్లె చెరువులో ఉపాధి హామీ పథకంలో భాగంగా అమృత్‌ సరోవర్‌ పనులను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కూలీలు చెరువుల్లో పూడికతీత, అలాగే కటవ నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. చెరువుల్లో మట్టిని రైతులకు ఉచితంగా అందజేయాలని, రైతు మాత్రం మట్టి కోసం ట్రాక్టర్‌ బాడుగ భరించాలన్నారు. కార్యక్రమంలో ఏపీడీవో వెంకట్రమణారెడ్డి, ఏపీవో పెంచలయ్య, జేఏఈ వెంకటపతి, టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్‌, కూలీలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-18T05:01:28+05:30 IST