సంపులో పడి వృద్ధుడి మృతి

ABN , First Publish Date - 2021-07-27T04:04:40+05:30 IST

జడ్చర్ల పట్టణం లక్ష్మీనగర్‌కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద వాచ్‌మన్‌గా పని చేస్తున్న మూసాపేట మండలం తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన సబ్బాల భీమయ్య(75) అక్కడే ఉన్న నీటి సంపులో పడి మృతి చెందినట్లు ఎస్‌ఐ శంషొద్దీన్‌ సోమవారం తెలిపారు.

సంపులో పడి వృద్ధుడి మృతి

జడ్చర్ల, జూలై 26: జడ్చర్ల పట్టణం లక్ష్మీనగర్‌కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద వాచ్‌మన్‌గా పని చేస్తున్న మూసాపేట మండలం తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన సబ్బాల భీమయ్య(75) అక్కడే ఉన్న నీటి సంపులో పడి మృతి చెందినట్లు ఎస్‌ఐ శంషొద్దీన్‌ సోమవారం తెలిపారు. మేస్త్రీతో కలిసి యజమాని మహేష్‌ వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందాడు. భీమయ్య భార్య లక్ష్మమ్మకు ఫోన్‌ ద్వారా విషయం చెప్పారు. సంపులో ఆదివారం రాత్రి పడి చనిపోయి ఉంటాడని తెలిపారు. భీమయ్య భార్య లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-07-27T04:04:40+05:30 IST