బస్సు కింద పడి వృద్ధురాలి మృతి

ABN , First Publish Date - 2021-08-20T02:44:53+05:30 IST

ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ వృద్ధురాలు మృతి చెందింది. జీడిమెట్ల

బస్సు కింద పడి వృద్ధురాలి మృతి

సికింద్రాబాద్: ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ వృద్ధురాలు మృతి చెందింది. జీడిమెట్ల బస్ డిపోకు చెందిన బస్‌గా గుర్తించారు. సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద ఆర్టీసీ బస్సు వెనక టైర్ కింద పడి వృద్ధురాలు మృతి చెందింది. ఘటనా స్థలానికి మోండా మార్కెట్ పోలీసులు చేరుకున్నారు. వృద్ధురాలు వయసు 60 సంవత్సరాలు ఉంటుంది. బస్‌ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.  కేసు నమోదు చేసుకుని  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-08-20T02:44:53+05:30 IST