కల్రోడ్డుపల్లెలో రైలు ఢీ కొని వృద్ధురాలి మృతి
ABN , First Publish Date - 2021-01-16T05:34:07+05:30 IST
చంద్రగిరి మండలం కల్రోడ్డుపల్లెలో రైలు ఢీకొని గోవిందమ్మ (70) మృతిచెందారు.
చంద్రగిరి, జనవరి 15: చంద్రగిరి మండలం కల్రోడ్డుపల్లెలో రైలు ఢీకొని గోవిందమ్మ (70) మృతిచెందారు. పాకాల రైల్వే హెడ్ కానిస్టేబుల్ గౌరిశంకర్ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన ఈమెకు చెముడు. గురువారం సాయంత్రం సమీపంలోని పట్టాలు దాటుతుండగా రైలు రావడాన్ని గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడిక్కడే మృతి చెందారు. పాకాల రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.