వాలీబాల్‌ టోర్నీ విజేత ఒంగోలు జట్టు

ABN , First Publish Date - 2021-12-06T05:14:53+05:30 IST

అంతర్‌ జిల్లాల మహిళా వాలీబాల్‌ పో టీల విజేతగా ఒంగోలు దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశా ల నిలిచింది.

వాలీబాల్‌ టోర్నీ విజేత ఒంగోలు జట్టు
కప్‌ను అందుకుంటున్న ఒంగోలు జట్టు సభ్యులు

ఒంగోలు(కార్పొరేషన్‌), డిసెంబరు 5 : అంతర్‌ జిల్లాల మహిళా వాలీబాల్‌ పో టీల విజేతగా ఒంగోలు దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశా ల నిలిచింది. ఆదివారం ఒంగోలులోని మినీ స్టేడియంలో రెండు రోజులపాటు జరి గిన పోటీలలో ఏడు డిగ్రీ కళాశాలల జట్లు పాల్గొన్నాయి. ఈక్రమంలో హోరా హోరీగా జరిగిన ఫైనల్స్‌లో ఒంగోలు జట్టుపై సత్తెనపల్లి ఎస్‌వీఆర్‌ జట్టు తలప డగా, ఒంగోలు జట్టు విజయం సాధించింది. అలాగే గుంటూరు ఆచార్యా నాగార్జు న యూనివర్సిటీ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ జట్టు తృతీయస్థానం, నాల్గవ స్థానం గుం టూరు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జట్టు నిలిచింది. కాగా విజేతలకు పోటీల అబ్జర్వర్‌ గౌరీశంకర్‌ కప్‌ను అందజేశారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్‌ ఇంది రాదేవి, వాలీబాల్‌ అసోసీయేషన్‌ కార్యదర్శి ఎం.ఆంజనేయులు, ఆర్గనైజింగ్‌ సెక్రట రీ ధనుంజయరావు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-06T05:14:53+05:30 IST