ప్రసిద్ధ్‌కు పాజిటివ్‌

ABN , First Publish Date - 2021-05-09T09:21:48+05:30 IST

ఐపీఎల్‌ వాయిదా పడినా క్రికెటర్లను మాత్రం కరోనా వీడడం లేదు. తాజాగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌)కు చెందిన పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ కూడా పాజిటివ్‌గా తేలాడు.

ప్రసిద్ధ్‌కు పాజిటివ్‌

మరో కేకేఆర్‌ ఆటగాడు సీఫెర్ట్‌కు కూడా..


న్యూఢిల్లీ: ఐపీఎల్‌ వాయిదా పడినా క్రికెటర్లను మాత్రం కరోనా వీడడం లేదు. తాజాగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌)కు చెందిన పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ కూడా పాజిటివ్‌గా తేలాడు. వచ్చేనెలలో జరిగే ఇంగ్లండ్‌ పర్యటనకు ప్రసిద్ధ్‌ టీమిండియా స్టాండ్‌బై ఆటగాడిగానూ ఎంపికయ్యాడు. అంతకుముందు శనివారం ఉదయం న్యూజిలాండ్‌కు వెళ్లే ప్రయత్నంలో ఉన్న మరో కేకేఆర్‌ బ్యాట్స్‌మన్‌ టిమ్‌ సీఫెర్ట్‌ కూడా కరోనా బారిన పడ్డాడు. దీంతో కేకేఆర్‌ నుంచి మొత్తం నలుగురు ఆటగాళ్లకు కరోనా సోకినట్టయింది. వరుణ్‌ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌ ఇదివరకే పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే.


25 ఏళ్ల ప్రసిద్ధ్‌ ప్రస్తుతం బెంగళూరులో హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నాడు. బబుల్‌ నుంచి ఇంటికి వెళ్లే ముందు రెండుసార్లు నెగెటివ్‌గానే తేలినా ఇంటికెళ్లాక పాజిటివ్‌ వచ్చినట్టు బోర్డు అధికారి తెలిపాడు. ట్రైనింగ్‌ సెషన్‌లో వరుణ్‌ నుంచి ప్రసిద్ధ్‌కు వైరస్‌ వ్యాప్తి చెంది ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అలాగే అహ్మదాబాద్‌ క్వారంటైన్‌లో ఉంటున్న సీఫెర్ట్‌ను మెరుగైన చికిత్స కోసం చెన్నై తరలించనున్నారు.

Updated Date - 2021-05-09T09:21:48+05:30 IST