పార్టీ పటిష్టతకు మరింత కృషిచేయాలి

ABN , First Publish Date - 2021-06-23T06:06:16+05:30 IST

టీడీపీ పటిష్టతకు మరింత కృషిచేయాలని మాజీ మంత్రి పరిటాలసునీత, ధర్మవరం నియోకవర్గ టీడీపీ ఇనచార్జ్‌ పరిటాలశ్రీరామ్‌లు పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు

పార్టీ పటిష్టతకు మరింత కృషిచేయాలి

-మాజీ మంత్రి పరిటాల సునీత, శ్రీరామ్‌ 

ధర్మవరంఅర్బన, జూన 22: టీడీపీ పటిష్టతకు మరింత కృషిచేయాలని మాజీ మంత్రి పరిటాలసునీత, ధర్మవరం నియోకవర్గ టీడీపీ ఇనచార్జ్‌ పరిటాలశ్రీరామ్‌లు పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. హిందూపురం పార్లమెంట్‌ కమిటీలో అధికారప్రతినిధి శ్రీశైలం పురుషోత్తంగౌడ్‌, కార్యనిర్వాహక కార్యదర్శి కాచర్లకంచన్న, కోశాధికారి చింతపులుసు పెద్దన్న నియమించపడ్డారు. దీంతో వారు మంగళవారం తమ ఎంపికకు సహకరించిన పరిటాలసునీత, పరిటాల శ్రీరామ్‌లను వెంకటాపురంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. మాపై ఉంచిన నమ్మకాన్నీ వమ్ముచేయకుండా సమిష్టిగా అందరిని కలుపుకుని పార్టీ అభివృద్దికి కృషిచేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీనాయకులు రుద్రార వి, కెహెచ ప్రకాశ తదితరులు పాల్గొన్నారు


Updated Date - 2021-06-23T06:06:16+05:30 IST