నేపాల్‌ ప్రజలూ సంతోషిస్తున్నారు

ABN , First Publish Date - 2022-05-17T08:10:59+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతోంటే నేపాల్‌ ప్రజలూ సంతోషిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు.

నేపాల్‌ ప్రజలూ సంతోషిస్తున్నారు

అయోధ్యలో రామాలయ నిర్మాణంపై మోదీ

లుంబిని, మే 16: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతోంటే నేపాల్‌ ప్రజలూ సంతోషిస్తున్నారని ప్రధాని  మోదీ అన్నారు. నేపాల్‌ ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవ్‌బా ఆహ్వానం మేరకు ఒక్కరోజు పర్యటన నిమిత్తం సోమవారం మోదీ ఆ దేశంలో పర్యటించారు. బుద్ధపూర్ణిమ సందర్భంగా.. గౌతమ బుద్ధుడి జన్మస్థలం లుంబినిలోని మాయాదేవి మందిరంలో దేవ్‌బాతో కలిసి మోదీ ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం లుంబిని డెవల్‌పమెంట్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేసిన బుద్ధ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అయోధ్యలోని రామాలయం గురించి ఆయనీ సందర్భంగా ప్రస్తావించారు.

Updated Date - 2022-05-17T08:10:59+05:30 IST