బాదుడు ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలి
ABN , First Publish Date - 2022-06-28T05:00:27+05:30 IST
అనేక రకాల ధరాభారంతో ప్రజ లను బాదుతున్న వైసీపీ ప్రభు త్వానికి ప్రజలే బుద్ధి చెప్పాలని మదనపల్లె టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్ పేర్కొన్నారు.
మదనపల్లె టౌన్, జూన్ 27: అనేక రకాల ధరాభారంతో ప్రజ లను బాదుతున్న వైసీపీ ప్రభు త్వానికి ప్రజలే బుద్ధి చెప్పాలని మదనపల్లె టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని 23, 24 వార్డుల్లో టీడీపీ శ్రేణులతో కలసి బాదుడే బాదుడు నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో చెత్తపన్ను వేయడంతో పాటు, ఆస్థి పన్నులను విపరీతంగా పెంచి ప్రజలను దోపిడి చేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాల పేరుతో ఒక చేత్తో ఇచ్చేది కొంచెమే అయినా, రెండు చేతులతో వైసీపీ ప్రభుత్వం ప్రజలను భారీగా దోచుకుతింటోందన్నారు. దీన్ని అడ్డుకోవాలంటే రాష్ట్రంలో టీడీపీ పాలన రావాలని చంద్రబాబును మళ్లీ సీఎం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు భవాని ప్రసాద్, మోడెం సిద్దప్ప, ఆర్జే వెంకటేశ్, నీలకంఠ, రెడ్డిశేఖర్, సోమశేఖర్, నిస్సార్ అహ్మద్, దాదాపీర్, విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.