వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-04-15T05:37:45+05:30 IST
మండల పరి ధిలోని కొట్టక్కి గ్రామానికి చెందిన సుండ్రు శ్రీనివాస రావు (50) బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
రామభద్రపురం,
ఏప్రిల్ 14: మండల పరి ధిలోని కొట్టక్కి గ్రామానికి చెందిన సుండ్రు
శ్రీనివాస రావు (50) బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించి
స్థానికుల వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీనివాసరావు గ్రామంలోని అతని జామితోటలో
పురుగుమందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపో వడంతో బంధువులు వెంటనే
సాలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా మృతిచెం దాడని వైద్యులు
ధ్రువీకరించారు. మృతుడి భార్య వెంకటలక్ష్మి దీనిపై పోలీసులకు ఫిర్యాదు
చేసింది. గత కొద్దిరోజులుగా అనారోగ్యం ఉండడంతో ఆ బాధ తట్టుకోలేక పురుగుల
మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. సాలూరు
ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధు వులకు
అప్పగించారు. ఏఎస్ఐ రవణమ్మ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ
కేసు విషయమై పోలీసులు గోప్యత పాటించడంతో పలు అనుమా నాలకు తావిస్తోంది.
మృతుడు వేరే కారణాలతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని, పూర్తిస్థాయిలో విచారణ
జరిపితే నిజాలు బయటపడవచ్చునని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.