ఇంటి ముందు పార్క్ చేసిన కారు చోరీ.. పోలీసుల ఎంట్రీతో షాకింగ్ ట్విస్ట్.. రాత్రిపూట కారును దొంగిలించింది ఎవరో తెలిసి..

ABN , First Publish Date - 2022-01-26T23:20:33+05:30 IST

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు. రాజస్థాన్‌లో జరిగిన చోరీ కూడా దాదాపు ఇలాంటిదే. అయితే ఈ కేసులో మాత్రం ఎట్టకేలకు దొంగ దొరికారు. ఇంటి ముందు పార్కు చేసిన కారును చాలా తెలివిగా చోరీ చేశారు..

ఇంటి ముందు పార్క్ చేసిన కారు చోరీ.. పోలీసుల ఎంట్రీతో షాకింగ్ ట్విస్ట్.. రాత్రిపూట కారును దొంగిలించింది ఎవరో తెలిసి..

చోరీలు చేయడంలో ప్రస్తుతం దొంగలు తెలివిమీరిపోయారు. కొందరు ఎంతో చాకచక్యంగా చోరీలు చేస్తూ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతుంటారు. బయటి దొంగలయితే ఏదో ఒక రోజు పట్టుబడతారు. కానీ ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు. రాజస్థాన్‌లో జరిగిన చోరీ కూడా దాదాపు ఇలాంటిదే. అయితే ఈ కేసులో మాత్రం ఎట్టకేలకు దొంగ దొరికారు. ఇంటి ముందు పార్కు చేసిన కారును చాలా తెలివిగా చోరీ చేశారు. చివరికి పోలీసుల విచారణలో దొంగ ఎవరో తెలియడంతో అంతా అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌లోని జైపూర్ సుభాష్ చౌక్ ప్రాంతంలో ఓ మహిళ ఒంటరిగా నివాసం ఉంటోంది. ఈమె భర్త రెండేళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో అప్పటినుంచి ఈమె వేరుగా ఉంటోంది. అయితే భర్త చనిపోయినప్పటి నుంచి ఆస్తి విషయంలో అత్తమామలతో కోడలికి విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో గత నెలలో కోడలు తన పుట్టింటికి వెళ్లింది. కొన్నాళ్ల తర్వాత మళ్లీ సుభాష్ చౌక్ ప్రాంతానికి వచ్చింది. అయితే వెళ్లే ముందు తన కారును ఇంటి ముందు పార్కు చేసి వెళ్లగా.. వచ్చేసరికి కనిపించలేదు. చుట్టు పక్కల వారిని విచారించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. వారికి లభించిన సీసీ ఫుటేజీల్లో షాకింగ్ సీన్ కనిపించింది.

పెళ్లయిన నాలుగు నెలలకే భార్యకు పెద్ద పెద్ద కోరికలు.. వాటిని తీర్చలేక ఆ భర్త తీసుకున్న నిర్ణయం..


కోడలి కారును స్వాయానా అత్తే చోరీ చేసినట్లు తేలింది. దీంతో ఆమెను విచారించగా.. మొదట బుకాయించినా చివరికి నేరం అంగీకరించింది. కోడలికి ఆస్తి పంచాల్సి వస్తుందనే భయంతో మొదటి నుంచీ చిన్న చిన్న విషయాలకు గొడవలు పడేది. ఈ క్రమంలో కోడలికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో కారును చోరీ చేసినట్లు తెలిసింది. నకిలీ తాళాలను తయారు చేయించి, ఈ చోరీకి పాల్పడినట్లు చెప్పింది. కారు చనిపోయిన కొడుకు పేరుతో ఉన్నట్లు తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

ఆటో డ్రైవర్‌కు వివాహితతో అనుకోకుండా పరిచయం.. నిర్మానుష్య ప్రదేశంలో ఇద్దరూ ఏకాంతంగా ఉండగా.. షాకింగ్ సీన్..

Updated Date - 2022-01-26T23:20:33+05:30 IST