పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం : ఎస్పీ
ABN , First Publish Date - 2021-07-23T05:31:30+05:30 IST
కొవిడ్ విధులు నిర్వహిస్తూ మృతి చెందిన పోలీసు కుటుంబాలకు అండగా ఉంటామని ఎస్పీ దీపికా పాటిల్ తెలిపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో బాధిత కుటుం బాలతో సమావేశమయ్యారు.
విజయనగరం క్రైం: కొవిడ్ విధులు నిర్వహిస్తూ మృతి చెందిన పోలీసు కుటుంబాలకు అండగా ఉంటామని ఎస్పీ దీపికా పాటిల్ తెలిపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో బాధిత కుటుం బాలతో సమావేశమయ్యారు. కరోనా విధులు నిర్వహిస్తూ వైరస్తో మృతి చెందిన పోలీసుల సేవలు ఎనలేనివన్నారు. కుటుంబ పెద్దను కోల్పోయామని అధైర్యపడొద్దన్నారు. బాధిత కుటుంబాలకు ఏ అవసరం వచ్చినా, తమను నేరుగా కలవొచ్చని సూచించారు. మృతి చెందిన పోలీస్ కుటుంబాలకు రావల్సిన బెనిఫిట్స్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీ సత్యనారాయణరావు, ఏఆర్ డీఎస్పీ శేషాద్రి, సీఐలు రాంబాబు, వెంకటరావు, ఆర్ఐ కుమార్, చిరంజీవి, డీపీవో పర్యవేక్షకులు శ్రీనివాసరావు, ప్రభాకరరావు, పోలీసు అసోసియేషన్ అడహక్ కమిటీ సభ్యుడు కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
వీజడ్పీ2: