ఉద్యోగ వర్గాల రాజకీయ ప్రమేయం ఆందోళనకరం: ఎమ్మెల్సీ రామారావు

ABN , First Publish Date - 2021-01-25T17:46:26+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఉద్యోగ వర్గాలు చేస్తోన్న రాజకీయ

ఉద్యోగ వర్గాల రాజకీయ ప్రమేయం ఆందోళనకరం: ఎమ్మెల్సీ రామారావు

విశాఖ: స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే  హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఉద్యోగ వర్గాలు చేస్తోన్న రాజకీయ వ్యాఖ్యలతో  రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి నెలకొందని ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్ఈసీ పై ఉద్యోగ వర్గాల ధిక్కారం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రాజకీయ అస్తిత్వం ప్రమాదంలో పడుతుందన్నారు. ఎన్నికల విధులు నిర్వహించబోమని ఉద్యోగ వర్గాలు చెప్పడం రాజ్యాంగ ధిక్కారమేనన్నారు. ఉద్యోగ సంఘాల చర్యలను ప్రభుత్వo సమర్ధించడం రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయడమేనని రామారావు విమర్శించారు.

Updated Date - 2021-01-25T17:46:26+05:30 IST