‘ప్రతిష్ట’ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-10-05T05:27:55+05:30 IST

ప్రతిష్ట ఇండసీ్ట్రస్‌ లిమిటెడ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డీవైఎ్‌ఫఐ రాష్ట్ర కార్యదర్శి ఆవనగంటి వెంకటేష్‌ , సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కల్లూరి మల్లేశం డిమాండ్‌ చేశారు.

‘ప్రతిష్ట’ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

చౌటుప్పల్‌, అక్టోబరు 4: ప్రతిష్ట ఇండసీ్ట్రస్‌ లిమిటెడ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డీవైఎ్‌ఫఐ రాష్ట్ర కార్యదర్శి ఆవనగంటి వెంకటేష్‌ , సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కల్లూరి మల్లేశం డిమాండ్‌ చేశారు. ఏమేరకు మండల కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట కంపెనీ కార్మికులు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెంకటేష్‌, మల్లేశం మాట్లాడుతూ 13రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని అన్నారు. కార్మికులకు 11నెలలుగా వేతన ఒప్పందం చేయకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. కంపెనీ మొండి వైఖరిని విడనాడి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. అంతకు ముందు పరిశ్రమ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు ఎండి.పాష, దూసరి వెంకటేశం, సత్యం, పల్చం వెంకటేశం, సత్యనారాయణ, బుచ్చమ్మ, లలిత, పార్వతమ్మ, రవీందర్‌రెడ్డి, సతీష్‌ పాల్గొన్నారు. అనంతరం ఆర్డీవోకు వినతి ప్రతం అందజేశారు.


Updated Date - 2022-10-05T05:27:55+05:30 IST