హామీపై మాట తప్పారు
ABN , First Publish Date - 2022-06-30T05:00:11+05:30 IST
ఎన్నికల సమయంలో విపక్ష నేతగా ఉన్న ఇప్ప టి సీఎం జగన్మోహన్రెడ్డి, పాత పట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి 2013 భూ సేకరణ చట్టం అమలు చేస్తామని వంశధార నిర్వాసితులకు హామీ ఇచ్చి ఇప్పుడు దానిని తుంగలో తొక్కి నామమాత్రంగా రూ.లక్ష చొప్పున అదనపు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మూర్తి విమర్శించారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేనందున తక్షణం వారు నిర్వాసితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.