ప్రజలకు ఇచ్చిన హామీలు నేరవేర్చాలి
ABN , First Publish Date - 2021-05-09T05:27:08+05:30 IST
ప్రజలకు ఇచ్చిన హామీలు నేరవేర్చాలి
- షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
కొత్తూర్: ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పక నేరవేర్చి, వారికి అందుబాటులో ఉండాలని షాద్నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లకు సూచించారు. నూతనంగా ఎన్నికైన కొత్తూర్ మున్సిపాలిటీ చైర్పర్సన్, వైస్చైర్మన్, కౌన్సిలర్లు శనివారం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలు మనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హూలైన వారందిరికీ అందేలా చూడాలన్నారు. ప్రజలతో మమేకమై టీఆర్ఎస్ పార్టీకి మంచిపేరు తెచ్చిపెట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీ వైస్చైర్మన్ ఈటే గణేష్, కొత్తూర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ బాతుక లావణ్యదేవేందర్యాదవ్, వైస్చైౖర్మన్ డోలీ రవీందర్, కౌన్సిలర్లు జయమ్మజనార్ధన్చారి, ప్రసన్నలతయాదయ్య, నాయకులు రాజు, క్రాంతిరెడ్డి, భిక్షపతి తదితరులున్నారు.