ప్రశ్నించే గొంతుకను గెలిపించాలి

ABN , First Publish Date - 2020-09-23T06:54:47+05:30 IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకైన తనను గెలిపించాలని తెలంగాణ ఇంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌

ప్రశ్నించే గొంతుకను గెలిపించాలి

తెలంగాణ ఇంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ 


సూర్యాపేటటౌన్‌, సెప్టెంబరు 22 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకైన తనను గెలిపించాలని తెలంగాణ ఇంటి పార్టీ వ్యవస్థాపక  అధ్యక్షుడు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం నిర్వహించిన నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.


రాష్ట్రంలో యువత చైతన్యవంతమై టీఆర్‌ఎ్‌సను తరిమికొట్టాలన్నారు. టీఆర్‌ఎస్‌ తరపున గెలిచిన ఏ ఒక్క ఎమ్మెల్యే ప్రజల సమస్యలపై మాట్లాడకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌ ఇస్తే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నుంచి తప్పుకొని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో బచ్చలకూరి జానయ్య, దేవేందర్‌రెడ్డి, సందీప్‌, బాషపంగు సునీల్‌, అనంతుల మధు, సంపత్‌నాయుడు, ఇరుగు కృష్ణ, భారీ అశోక్‌, జటంగి సురేష్‌,  నాగేశ్వర్‌రావు, పడిదల ప్రసాద్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-23T06:54:47+05:30 IST