రైల్వే పనుల్లో అపశృతి
ABN , First Publish Date - 2020-08-08T08:15:01+05:30 IST
వేమూరు రైల్వేస్టేషన్ పరిధిలో విద్యుత్ లైన్ ఏర్పాటు పనుల్లో శుక్రవారం అపశృతి చోటుచేసుకుంది. కరెంట్ పోల్స్ను క్రేన్ ..
కరెంట్ పోల్పడి యువకుడి మృతి
వేమూరు, ఆగస్టు 7: వేమూరు రైల్వేస్టేషన్ పరిధిలో విద్యుత్ లైన్ ఏర్పాటు పనుల్లో శుక్రవారం అపశృతి చోటుచేసుకుంది. కరెంట్ పోల్స్ను క్రేన్ సహాయంతో తరలిస్తున్న తరుణంలో జరిగిన ప్రమాదంలో కాంట్రాక్టర్ ద్వారా కూలి పనికి వచ్చిన యువకుడు మృతి చెందాడు. చినరావూరు నుంచి రేపల్లె వరకు రైలు మార్గంలో విద్యుత్ లైన్ ఏర్పాటు పనులు సాగుతున్నాయి. తెనాలి బాలాజీరావుపేటకు చెందిన షేక్ కొమల్కాంత్(20) కూలీగా వచ్చాడు. ట్రాక్పై ఉంచిన గూడ్స్ ట్రక్ లోకి సమీపంలో ఉన్న కరెంట్ పోల్ను పైకి ఎత్తుతుండగా క్రేన్ లింక్ వైర్ జారి కొమల్ కాంత్ పైన పడింది వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు వదిలేశాడు. దీనిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే 108కు ఫోన్ చేసిన అది రావడం ఆలస్యం అయిందని, సకాలంలో వచ్చి ఉంటే కొమల్కాంత్ బతికి ఉండేవాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు.