స్థానికులకే రాజ్యసభ సీటు కేటాయించాలి

ABN , First Publish Date - 2022-05-26T06:45:29+05:30 IST

రాష్ట్రంలోని స్థానికులకే రాజ్యసభ సీటు కేటాయించాలని కోరుతూ ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగులు బుధవారం ఎంవీపీ కాలనీలో భారీ ర్యాలీ నిర్వహించారు.

స్థానికులకే రాజ్యసభ సీటు కేటాయించాలి
ఎంవీపీ కాలనీలో ర్యాలీ చేస్తున్న నిరుద్యోగులు

ఎంవీపీ కాలనీలో నిరుద్యోగుల భారీ ర్యాలీ 

ఎంవీపీ కాలనీ, మే 25: రాష్ట్రంలోని స్థానికులకే రాజ్యసభ సీటు కేటాయించాలని కోరుతూ ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగులు బుధవారం ఎంవీపీ కాలనీలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఏఎస్‌ రాజా సర్కిల్‌ నుంచి వెంకోజీపాలెం రోడ్డు వరకు ర్యాలీ సాగింది. ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేస్తూ నిరుద్యోగులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భం గా హేమంత్‌కుమార్‌ మాట్లాడుతూ తెలంగాణకు చెందిన ఆర్‌.కృష్ణయ్య, నిరంజన్‌రెడ్డికి వైసీపీ రాజ్యసభ సీట్లు ఇవ్వాలని నిర్ణయించడం ఆంధ్రులను అవమానించడమేనన్నారు. ఇప్పటికైనా జరిగిన పొరపాటును సరిదిద్దుకుని, స్థానికులకే రాజ్యసభ సీట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నిరుద్యోగులు రూప, రమ్య, శ్రీలక్ష్మి, అక్కాబత్తుల గిరీష్‌, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-26T06:45:29+05:30 IST