ప్రాణం తీసిన రాతి గుండు!

ABN , First Publish Date - 2020-07-06T10:58:26+05:30 IST

రాతి గుండు ఎత్తే సరదా ఓ యువకుడి ప్రాణాన్ని..

ప్రాణం తీసిన రాతి గుండు!

హొళగుంద(కర్నూలు): రాతి గుండు ఎత్తే సరదా ఓ యువకుడి ప్రాణాన్ని తీసింది. పట్టు తప్పి కాలు జారడంతో రాతి గుండు మీద పడింది. దీంతో పింజారి షాషాబు (28) అనే యువకుడు మృతి చెందాడు. హొళగుంద మండలం సులువాయి గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. షాషాబు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. తీరిక సమయంలో స్నేహితులతో కలిసి బసవన్నగుడి ఆవరణలో ఉన్న 120 కిలోల రాతి గుండును ఎత్తడం అలవాటుగా మార్చుకున్నాడు. ఎప్పటిలాగే ఆదివారం ఉదయం ఈ క్రీడలో నిమగ్నమై ఉండగా ప్రమాదం జరిగింది. గుండు మీద పడి తీవ్రంగా గాయపడిన బాధితుడుని కుటుంబ సభ్యులు ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. షాషాబుకి 15 నెలల క్రితం మాళమ్మ అనే యువతితో వివాహం జరిగింది. రెండు నెలల క్రితం వారికి కొడుకు పుట్టాడు. యువకుడి మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.

Updated Date - 2020-07-06T10:58:26+05:30 IST