దేశాన్ని శక్తివంతం చేయడంలో కాంగ్రెస్‌ పాత్ర అమోఘం

ABN , First Publish Date - 2022-08-11T05:30:00+05:30 IST

దేశాన్ని శక్తివంతం చేయడంలో కాంగ్రెస్‌ పాత్ర అమోఘం

దేశాన్ని శక్తివంతం చేయడంలో కాంగ్రెస్‌ పాత్ర అమోఘం
బొంరాస్‌పేట్‌: తుంకిమెట్ల మీదుగా పాదయాత్ర చేస్తున్న పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, తదితరులు

  • డీసీసీ అధ్యక్షుడు, పరిగి మాజీ ఎమ్మెల్యే టీఆర్‌ఆర్‌

పరిగి/బొంరాస్‌పేట్‌/పూడూర్‌, ఆగస్టు 11 : స్వాతంత్య్రం సిద్ధించాక ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి భారతదేశాన్ని ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా తయారు చేయడంలో కాంగ్రెస్‌ పార్టీ పాత్ర అమోఘమైందని డీసీసీ అధ్యక్షుడు, పరిగి మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఆజాదీకా గౌరవ్‌ పాదయాత్రలో భాగంగా గురువారం పరిగి మండలం గడిసింగాపూర్‌ నుంచి పరిగి పట్టణం మీదుగా నస్కల్‌ వరకు పాదయాత్ర చేపట్టారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా జనరల్‌ సెక్రటరీ హన్మంతుముదిరాజ్‌, పరిగి మండలాధ్యక్షుడు పరుషరాంరెడ్డి, పట్టణాధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.  అదేవిధంగా బొంరాస్‌పేట్‌ మండలం తుంకిమెట్ల మీదుగా నస్కల్‌ వరకు పాదయాత్ర చేపట్టారు. పూడూర్‌ మండల కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పరిగి మండలం గడిసింగాపూర్‌లో పాదయాత్రలో పాల్గొన్నారు. అదేవిధంగా బొంరాస్‌పేట్‌, పూడూర్‌ మండలాల కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, పూడూర్‌ మండల కార్యదర్శి శ్రీనివాస్‌, మండలాధ్యక్షుడు సురేందర్‌, అజీమ్‌ పటేల్‌ తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు.


Updated Date - 2022-08-11T05:30:00+05:30 IST