సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-03-02T05:51:29+05:30 IST

సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని ఎమ్మె ల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. హుజూర్‌నగర్‌లోని ఎంపీపీ కార్యాలయంలో టీయూడబ్ల్యూజే, ఐజేయూ జిల్లా శాఖల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఆత్మీయ సన్మాన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు.

సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం: ఎమ్మెల్యే
ఉపాధ్యాయుల ఆత్మీయ సన్మానసభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శానంపూడి

హుజూర్‌నగర్‌, మార్చి 1 : సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని ఎమ్మె ల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. హుజూర్‌నగర్‌లోని ఎంపీపీ కార్యాలయంలో టీయూడబ్ల్యూజే, ఐజేయూ జిల్లా శాఖల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఆత్మీయ సన్మాన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఉపాధ్యాయ వృత్తితో పాటు జర్నలిజంలో పనిచేస్తూ సమాజానికి సేవచేస్తున్న వారికి గుర్తింపు ఉంటుందన్నారు. తెలంగా ణ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇల్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తుందన్నారు. అనంతరం ఇటీవల పదవీ విరమణ పొం దిన టీవీఎల్‌, దయాకర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, దేవ రం రామిరెడ్డిలను ఎమ్మెల్యే సన్మానిం చా రు.  కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ అర్చనారవి, వైస్‌చైర్మన్‌ నాగేశ్వరరావు, ఎంపీపీ శ్రీనివాసు, అఖిలపక్ష  నాయకులు మల్లికార్జున్‌రావు, అరుణ్‌కుమార్‌, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, అజయ్‌రెడ్డి, బాబు, కోటిరెడ్డి, దొంతిరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి, సహదేవరావు తదితరులు పాల్గొన్నారు.   

Updated Date - 2021-03-02T05:51:29+05:30 IST