తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కవుల పాత్ర అద్వితీయం
ABN , First Publish Date - 2021-01-25T03:16:53+05:30 IST
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పా టులో కవుల పాత్ర అద్వితీయ మని, తెలంగాణ ప్రజలను చై తన్యవంతులను చేయడంలో వారు నిర్విరామ కృషి చేసిన ట్లు జడ్పీ వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాజీసింగ్, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు.
కల్వకుర్తి టౌన్, జనవరి 24: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పా టులో కవుల పాత్ర అద్వితీయ మని, తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేయడంలో వారు నిర్విరామ కృషి చేసిన ట్లు జడ్పీ వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాజీసింగ్, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. కల్వకుర్తిలోని యూటీఎఫ్ భవనంలో ఆది వారం కవి, రచయిత కొమ్మగో ని శ్రీనయ్యగౌడ్ రచించిన మహబూబ్నగర్ వీర శిలలు అనే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చడంలో కవులు, రచయితలు వారి రచనల ద్వారా యావత్తు తెలంగాణ ప్రజలను ఒక్కతాటిపైకి తీసుకురావడంలో తీవ్ర ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నారు. కల్వకుర్తి మునిసిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, వైస్ చైర్మన్ షాహెద్, వెల్దండ జడ్పీటీసీ విజితారెడ్డి, జిల్లెల మాజీ సర్పంచ్ గుమ్మరాములు, నాయకులు వెంకటయ్య గౌడ్, రవిగౌడ్, రమేష్నాయక్, చంద్ర కాంత్, శ్రీశైలం, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.