నైట్ క్లబ్లకు వెళ్లి వస్తే ఇలాగే ఉంటుంది!
ABN , First Publish Date - 2022-05-08T08:42:45+05:30 IST
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై బీజేపీ ‘వీడియో’ల దాడి చేస్తోంది.
రాహుల్ తెలంగాణ పర్యటనపై బీజేపీ ట్వీట్
ఏమీ తెలియని వ్యక్తి.. ప్రజలకేం చెప్తాడు?: ఒవైసీ
న్యూఢిల్లీ, మే 7 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై బీజేపీ ‘వీడియో’ల దాడి చేస్తోంది. ఇంతకుముందు నేపాల్లో రాహుల్ నైట్ క్లబ్కు వెళ్లిన వీడియోను బహిర్గతం చేసి ఆరోపణలు గుప్పించిన ఆ పార్టీ.. తాజాగా రాహుల్ తెలంగాణ పర్యటనకు సంబంధించి మరో వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తెలంగాణ రైతులకు సంఘీభావం ప్రకటించేందుకు రాష్ట్రానికి వెళ్లిన రాహుల్.. వరంగల్లో రైతు సంఘర్షణ సభకు హాజరయ్యేందుకు ముందు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో, ఇతర కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ, ‘‘సభ ప్రధాన అంశమేంటి? సరిగ్గా చెప్పండి.. ఏం మాట్లాడాలి?’’ అని రాహుల్ అడిగిన దృశ్యంతో కూడిన వీడియోను బీజేపీ ఐటీ విభాగం ఇన్చార్జి అమిత్ మాలవీయ ట్విటర్లో పోస్ట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఘాటుగా స్పందించారు. అమిత్ మాలవీయ పరిణతి లేని వ్యక్తి అని ట్వీట్ చేశారు. మరోవైపు మాలవీయ ట్వీట్ ఆధారంగా రాహుల్గాంధీపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ విమర్శలు చేశారు. ‘‘తెలంగాణ ప్రజలకు ఏం సందేశమివ్వాలో కూడా మీకు తెలియనప్పుడు.. వారు మీకెందుకు మద్దతిస్తారు?’’ అంటూ ఒవైసీ ట్వీట్ చేశారు. అలాగే, టీఆర్ఎస్, బీజేపీ, మజ్లి్సలను సవాల్ చేసేందుకే తెలంగాణకు వచ్చానని చెబుతున్న రాహుల్ గాంధీ.. ఇకపై వయనాడ్లోనూ ఓడిపోతారని వ్యాఖ్యానించా రు. దమ్ముంటే హైదరాబాద్ లేదా మెదక్ నుంచి పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని రాహుల్కు సవాల్ విసిరారు.