పాఠశాలల బంద్‌ విజయవంతం

ABN , First Publish Date - 2022-07-06T04:19:55+05:30 IST

భుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన పాఠశాలల బంద్‌ విజయవంతం అయింది.

పాఠశాలల బంద్‌ విజయవంతం
కాగజ్‌నగర్‌లో మాట్లాడుతున్న ఏబీవీపీ నాయకులు

ఆసిఫాబాద్‌ రూరల్‌, జూలై 5: ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన పాఠశాలల బంద్‌ విజయవంతం అయింది. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సునీల్‌, తదితరులు పాల్గొన్నారు. 

కాగజ్‌నగర్‌ టౌన్‌: రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన పాఠశాలల బందు కాగజ్‌నగర్‌లో విజయవంతమైంది. ఈ సందర్భగా విద్యార్థి సంఘం నాయకుడు మల్‌ రాజు మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కార్యక్రమంలో నాయకులు, నవీన్‌, కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు. 

చింతలమానేపల్లి: ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన పాఠశాలల బంద్‌ మండలంలో విజయవంతమైంది. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు ప్రవీణ్‌, సాయి, అరుణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

కౌటాల: మండలంలో ఏబీవీపీ ఇచ్చిన పిలుపు మేరకు పాఠశాలల బంద్‌ విజయవంతం అయింది. మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూసి వేశారు. 

Updated Date - 2022-07-06T04:19:55+05:30 IST