పాఠశాలల బంద్ విజయవంతం
ABN , First Publish Date - 2022-07-06T04:19:55+05:30 IST
భుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన పాఠశాలల బంద్ విజయవంతం అయింది.
ఆసిఫాబాద్ రూరల్, జూలై 5: ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన పాఠశాలల బంద్ విజయవంతం అయింది. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సునీల్, తదితరులు పాల్గొన్నారు.
కాగజ్నగర్ టౌన్: రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన పాఠశాలల బందు కాగజ్నగర్లో విజయవంతమైంది. ఈ సందర్భగా విద్యార్థి సంఘం నాయకుడు మల్ రాజు మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కార్యక్రమంలో నాయకులు, నవీన్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
చింతలమానేపల్లి: ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన పాఠశాలల బంద్ మండలంలో విజయవంతమైంది. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు ప్రవీణ్, సాయి, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
కౌటాల: మండలంలో ఏబీవీపీ ఇచ్చిన పిలుపు మేరకు పాఠశాలల బంద్ విజయవంతం అయింది. మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూసి వేశారు.