సేవను మహాభాగ్యంగా భావించాలి
ABN , First Publish Date - 2022-06-27T06:02:46+05:30 IST
తోటి వారికి సేవచేయడాన్ని మహాభాగ్యంగా భావించాలని సత్యసాయి సేవాసమితి జాతీయ అధ్యక్షుడు నిమీ్షపాండే పేర్కొన్నారు.
సత్యసాయి సేవాసమితి జాతీయ అధ్యక్షుడు నిమీష్ పాండే
ముగిసిన సేవాదళ్ సదస్సు
పుట్టపర్తి, జూన 26: తోటి వారికి సేవచేయడాన్ని మహాభాగ్యంగా భావించాలని సత్యసాయి సేవాసమితి జాతీయ అధ్యక్షుడు నిమీ్పాండే పేర్కొన్నారు. సేవాదళ్ సదస్సు ముగింపు కార్యక్రమాన్ని ఆదివారం స్థానిక సాయి కుల్వంతలో నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు మాట్లాడుతూ సత్యసాయి చూపిన మార్గంలో పయనిస్తూ సేవ చేయాలన్నారు. సత్యసాయి సేవలను మారుమూల గ్రామాలకు కూడా చేర్చాలన్నారు. అనంతరం మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్.. సేవాదళ్ సభ్యులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. సమావేశంలో ట్రస్టుసభ్యులు చక్రవర్తి, నాగానందం పాల్గొన్నారు.