ప్రొఫెసర్‌ జయశంకర్‌ సేవలు చిరస్మరణీయం

ABN , First Publish Date - 2021-06-22T04:19:31+05:30 IST

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్‌ జయశంకర్‌ చేసిన సేవలు చిరస్మరణీయమని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్య లక్ష్మీ ఓదెలు తెలిపారు. సోమవా రం జయశంకర్‌ వర్ధంతి సంద ర్భంగా చౌరస్తా వద్దగల జయశం కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ప్రొఫెసర్‌ జయశంకర్‌ సేవలు చిరస్మరణీయం
మందమర్రిలో జయశంకర్‌ విగ్రహానికి పూలమాల వేస్తున్న జెడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీఓదెలు

మందమర్రిటౌన్‌, జూన్‌ 21: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్‌ జయశంకర్‌ చేసిన సేవలు చిరస్మరణీయమని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్య లక్ష్మీ ఓదెలు తెలిపారు. సోమవా రం జయశంకర్‌ వర్ధంతి సంద ర్భంగా చౌరస్తా వద్దగల జయశం కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలం గాణ కోసం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప సేవకుడు జయ శంకర్‌ అని తెలిపారు.  మాజీ విప్‌ నల్లాల ఓదెలు,  నాయకులు ఈశ్వర్‌, ఎండీ అబ్బాస్‌, కొంగల తిరుపతిరెడ్డి, బట్టు రాజ్‌కుమార్‌, శ్రీనివాస్‌రెడ్డి, రాకం సంతోష్‌, సురేందర్‌ పాల్గొన్నారు. 

టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ప్రొఫెసర్‌ జయశం కర్‌ వర్ధంతి నిర్వహించారు. జయశంకర్‌ చిత్రపటానికి  గుర్తింపు సంఘం ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు బడికెల సంపత్‌, జె.రవీందర్‌, రమణ, సూర్యనారా యణ, లక్ష్మణ్‌, బిక్షపతి పాల్గొన్నారు. 

 ఏసీసీ: జిల్లా కేంద్రంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్ధంతిని వివిధ ప్రజాసంఘాలు, సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించారు. కోర్టు కాంప్లెక్స్‌లోని బార్‌ అసోసియేషన్‌ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అధ్యక్షుడు గడికొప్పుల మురళి, ఉపాధ్యక్షుడు భుజంగరావు, ప్రధాన కార్యదర్శి కట్కూరి గంగయ్యల ఆధ్వర్యంలో జయశంకర్‌ చిత్రపటానికి  నివాళులర్పించారు. న్యాయవాదులు రంగు మల్లేష్‌, సలిగంటి స్వామి, సాగె గురువయ్య పాల్గొన్నారు. 

టీఎన్‌జీవోస్‌ భవన్‌లో ప్రొఫెసర్‌ జయశంకర్‌  చిత్రపటానికి జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, సెంట్రల్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్‌ల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు.  రాయకంటి ప్రతాప్‌, శ్రీహరి, రామ్మోహన్‌, పొన్న మల్ల య్య, సత్యనారాయణ, గోపాల్‌ పాల్గొన్నారు. 

విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో  ఆచార్య జయశంకర్‌ వర్ధంతిని నిర్వహించారు. సంఘం సభ్యులు ముడుపు రామ్‌ప్రకాష్‌, కొత్తూరి రాజయ్య, పూసాల వెంకన్న, రామోజు రాజేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు. 

 బెల్లంపల్లి: మున్సిపల్‌ కార్యాలయంలో తెలం గాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్ధంతి  నిర్వ హించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత జయ శంకర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. వైస్‌చైర్మన్‌ సుదర్శన్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-22T04:19:31+05:30 IST