వైద్యుల సేవలు మరువలేనివి
ABN , First Publish Date - 2022-07-02T06:35:16+05:30 IST
కరోనా మహమ్మారి విజృంభించిన విపత్కర పరిస్థితుల్లో వైద్యులు, సిబ్బంది చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని టీఎన్జీవో్స జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రావణ్కుమార్ అన్నారు.
నల్లగొండ అర్బన్, జూలై 1: కరోనా మహమ్మారి విజృంభించిన విపత్కర పరిస్థితుల్లో వైద్యులు, సిబ్బంది చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని టీఎన్జీవో్స జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రావణ్కుమార్ అన్నారు. డాక్టర్స్డే సందర్భంగా డీఎంహెచ్వో డాక్టర్ అనిమళ్ల కొండల్రావు, ఇతర వైద్యులు, వైద్య సిబ్బందిని డీఎంహెచ్వో కార్యాలయంలో గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా సమయంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైనా వైద్యులు, వైద్య సిబ్బంది ప్రా ణాలు ఫణంగా పెట్టి సేవలందించారన్నారు. కరోనా మహమ్మారికి ఏ మాత్రం భయపడకుండా ధైర్యంగా విధి నిర్వహణలో పాల్గొన్న వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ప్రాణాలను రక్షించడంలో వారి సేవ లు వెలకట్టలేనివన్నారు. కార్యక్రమంలో టీఎన్జీవో్స జిల్లా ఉపాధ్యక్షుడు జె.శేఖర్రెడ్డి, కె.దయాకర్రావు, జి.రామచంద్రయ్య, శ్రీనివాస్, సైదులు నాయక్, పంతులు శ్రీనివాస్, వెంకటయ్య, దుర్గయ్య, వి.భాస్కర్, నీజర్, భిక్షమయ్య, రాజయ్య, కొండల్రావు తదితరులు పాల్గొన్నారు.