ఇరుపక్షాల రాజీతోనే కేసుల పరిష్కారం
ABN , First Publish Date - 2022-08-14T05:47:21+05:30 IST
ఇరుపక్షాల రాజీతోనే కేసుల పరిష్కారం
పరిగి, ఆగస్టు 13 : ఇరుపక్షాలు రాజీపడితేనే కేసుల విషయంలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పరిగి మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి వి.హరికుమార్ అన్నారు. శనివారం పరిగి కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించారు. ఈమేరకు 210 కేసులను పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, దీంతో నేరాలను నిరోధించవచ్చన్నారు. ఏపీపీవో దీపారాణి, ఏజీపీ బి.వెంకట్రెడ్డి, బార్ అసోషియేషన్ అధ్యక్షుడు కె.నరేంద్రయాదవ్, న్యాయవాదులు బి.లింగం, సీహెచ్ బాలముకుందం, అందె విజయ్కుమార్; రాముయాదవ్, ఆనంద్గౌడ్, కృష్ణారెడ్డి, గౌస్పాషా, శ్రీనివా్సరెడ్డిలు పాల్గొన్నారు.