20న కలెక్టరేట్ ముట్టడి
ABN , First Publish Date - 2022-01-18T06:10:10+05:30 IST
ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈనెల 20న కలెక్టరేట్ ముట్టడి చేపట్టనున్నట్లు ఆ సంఘం నాయకులు సోమవారం తెలిపారు.
అనంతపురం విద్య, జనవరి 17: ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈనెల 20న కలెక్టరేట్ ముట్టడి చేపట్టనున్నట్లు ఆ సంఘం నాయకులు సోమవారం తెలిపారు. సోమవారం స్థానిక ఉపాధ్యాయ భవన్లో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు జయరామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సాలవేముల బాబు ఇతర నాయకులు సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ... పీఆర్సీపై అశుతోష్ మిశ్రా కమిషన్ నివేదికను బయట పెట్టాలన్నారు. సీపీఎస్ రద్దు చేయాలన్నారు. హెచఆర్ఏ స్లాబులును యథాతథంగా కొనసాగించాలన్నారు. ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. 20న చేపట్టబోయే కలెక్టరేట్ ముట్టడికి పెద్దఎత్తున ఉద్యోగులు, ఉపాధ్యాయులు హాజరుకావాలని వారు కోరారు. సమావేశంలో నాయకులు నాగేంద్ర, రమణారెడ్డి, సిరాజుద్దీన్, రవీంద్ర, ఓబులేసు, సాకే పెద్దన్న, గోపాల్రెడ్డి, సూర్యుడు, శ్రీనివాసులు, విశ్వనాథ్రెడ్డి, లింగమూర్తి, జార్జ్, నాగభూషణం, వెంకటరత్నం, పురుషోత్తం, వెంకటరెడ్డి పాల్గొన్నారు.