రైతు వేదికల నిర్మాణాల్లో వేగం పెంచాలి

ABN , First Publish Date - 2020-10-20T07:21:40+05:30 IST

రైతు వేదికల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అన్నారు. సోమవారం మండలంలోని మూడపల్లి, మర్రిగడ్డ, చందుర్తి, మల్యాల గ్రామాల్లో నిర్మిస్తున్న రైతువేదికల పనులను పరిశీలించారు

రైతు వేదికల నిర్మాణాల్లో వేగం పెంచాలి

కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ 


చందుర్తి,అక్టోబరు 19: రైతు వేదికల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అన్నారు. సోమవారం మండలంలోని మూడపల్లి, మర్రిగడ్డ, చందుర్తి, మల్యాల గ్రామాల్లో నిర్మిస్తున్న రైతువేదికల పనులను పరిశీలించారు. సర్పంచులు చిలుక ఆంజిబాబు, జలపతి, ప్రేమలత-శ్రీనివాస్‌, లక్ష్మీనారాయణ, వైస్‌ ఎంపీపీ అబ్రహం, తహసీల్దార్‌ నరేష్‌, ఎంపీడీవో రవీందర్‌, మండల ప్రత్యేక ఆధికారి వెంకటరమణమూర్తి, ఏపీఎం రజిత, పీఆర్‌ఏఈ వెంకటేశ్వర్లు, ఏవో దుర్గరాజు, ఉపసర్పంచ్‌ పుల్కం రవి  ఉన్నారు. 


రుద్రంగి: రైతు వేదికల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అన్నారు. సోమవారం మండలంలోని రుద్రంగితోపాటు మానాలలోని రైతు వేదికల పనులను పరిశీలించారు.  దసరాలోగా పూర్తి చేయాలని ఆదేశించారు.  సర్పంచ్‌ తర్రె ప్రభలతమనోహార్‌, అధికారులు పాల్గొన్నారు. 


తంగళ్లపల్లి: తంగళ్లపల్లి మండలం బద్దనపల్లి గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక  పనులను సోమవారం సెస్‌ చైర్మన్‌ దోర్నాల లక్ష్మారెడ్డి, ఎంపీపీ పడిగెల మానస రాజు పరిశీలించారు. నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు రాత్రి పూట కూడా పనులు కొనసాగిస్తున్నామని ఏఈ సుమన్‌  ప్రజా ప్రతినిధు లకు వివరించారు.

Updated Date - 2020-10-20T07:21:40+05:30 IST