మొలకలు వచ్చేశాయ్‌!

ABN , First Publish Date - 2021-11-23T04:51:38+05:30 IST

మండలంలో వరి పంట నేలవాలి మొలకలు వచ్చాయి.

మొలకలు వచ్చేశాయ్‌!
సోమయాజులపల్లె గ్రామంలో మొలకలు వచ్చిన వరి పంట

బండి ఆత్మకూరు, నవంబరు 22:  మండలంలో వరి పంట నేలవాలి మొలకలు వచ్చాయి. వారం రోజులుగా ఎడతెరపి లేకుండా   వానలు కురియటంతో సోమయాజులపల్లె, శింగవరం, ఈర్నపాడు, కడమలకాల్వ, వెంగళరెడ్డిపేట, సంతజూటూరు, పెద్దదేవళాపురం, జీసీపాలెంతో పాటు మరికొన్ని గ్రామాల్లో కోతకు వచ్చిన వరి    నేలవాలిపోయి   మొలకలు వచ్చాయి. దీంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు.  ప్రభుత్వం పంట నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2021-11-23T04:51:38+05:30 IST