11 ఏళ్ల క్రితం జాబ్ పేరుతో భారత్‌కు తీసుకొచ్చి వ్యభిచార రొంపిలోకి.. ఆమె చెప్పిన దారుణ నిజాలు విని నివ్వెరపోయిన పోలీసులు..!

ABN , First Publish Date - 2021-11-26T20:48:52+05:30 IST

ఆమె బంగ్లాదేశ్‌కు చెందిన యువతి.. ఆమెకు 15 సంవత్సరాల వయసు రాగానే 2009లో తల్లి చనిపోయింది..

11 ఏళ్ల క్రితం జాబ్ పేరుతో భారత్‌కు తీసుకొచ్చి వ్యభిచార రొంపిలోకి.. ఆమె చెప్పిన దారుణ నిజాలు విని నివ్వెరపోయిన పోలీసులు..!

ఆమె బంగ్లాదేశ్‌కు చెందిన యువతి.. ఆమెకు 15 సంవత్సరాల వయసు రాగానే 2009లో తల్లి చనిపోయింది.. పేదరికంతో బాధపడుతున్న ఆ యువతికి ఉద్యోగం ఆశ చూపి ఓ వ్యక్తి బోర్డర్ దాటించి భారత్‌కు తీసుకొచ్చాడు.. కోల్‌కతాలో ఓ బ్రోకర్‌కు అమ్మేశాడు.. ఆ బ్రోకర్ ఆమెను ముంబై తీసుకెళ్లి మరొకరికి అమ్మేశాడు.. అతను ఆమె చేత వ్యభిచారం చేయించాడు.. మాట వినకపోతే చిత్రహింసలు పెట్టాడు.. ఇటీవల పోలీసులు చేసిన రైడింగ్‌లో పట్టుబడిన ఆమె దారుణ నిజాలు చెప్పింది. 


`ఉద్యోగం ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి ఓ వ్యక్తి అక్రమంగా నన్ను బోర్డర్ దాటించి భారత్‌లోకి తీసుకొచ్చాడు. దాదాపు రెండ్రోజులు నడిపించి కోల్‌కతా చేర్చాడు. అక్కడ ఓ బ్రోకర్‌కు నన్ను లక్ష రూపాయలకు అమ్మేశాడు. అతను నన్ను ముంబై తీసుకెళ్లి మరొకరికి అప్పగించాడు. అతను టార్చర్ పెట్టాడు. చిన్న బట్టలు వేసుకొని ఎలా నడవాలో అతను 15 రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చాడు. తర్వాత విటుల దగ్గరకు పంపాడు. చెప్పిన మాట వినకపోతే సిగరెట్‌తో ఒళ్లంతా కాల్చేవాడు. దాని మీద పసుపు పూసేవాడు. 


ఆ బాధకు తాళలేక నేను వ్యభిచారం కూపంలోకి దిగాను. ఆ తర్వాత నన్ను ఇండోర్‌కు తీసుకొచ్చారు. రోజుకు చాలా మంది విటుల దగ్గరకు పంపేవారు. వారు చెప్పినది చెప్పినట్టు చేయకపోతే చిత్రహింసలు పెట్టేవారు. భోజనం పెట్టకుండా పస్తులు ఉంచేవారు. నేనే కాదు ఎంతో మంది పేద యువతులు బంగ్లాదేశ్ నుంచి ముర్షీదాబాద్, ముంబై మీదుగా ఇండోర్ వచ్చార`ని బాధిత మహిళ పోలీసులకు చెప్పింది.  

Updated Date - 2021-11-26T20:48:52+05:30 IST