పార్టీకి కార్యకర్తలే బలం

ABN , First Publish Date - 2021-07-25T04:29:36+05:30 IST

పార్టీ అనేక ఆటుపోట్లు ఎ దుర్కొన్నప్పటికీ బలంగా ఉండడానికి కార్యకర్తలే కారణమని జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ యన మాట్లాడారు. రాష్ట్రంలో నూతన సారథ్యంలో పార్టీకి పూర్వవైభవం వచ్చిందన్నారు. ఏడు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రేవంత్‌రెడ్డి నియామకం త ర్వాత పార్టీని వీడినవారు తిరిగి వస్తున్నారన్నారు.

పార్టీకి కార్యకర్తలే బలం

నిజామాబాద్‌అర్బన్‌, జూలై 24: పార్టీ అనేక ఆటుపోట్లు ఎ దుర్కొన్నప్పటికీ బలంగా ఉండడానికి కార్యకర్తలే కారణమని జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ యన మాట్లాడారు. రాష్ట్రంలో నూతన సారథ్యంలో పార్టీకి పూర్వవైభవం వచ్చిందన్నారు. ఏడు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రేవంత్‌రెడ్డి నియామకం త ర్వాత పార్టీని వీడినవారు తిరిగి వస్తున్నారన్నారు. జిల్లా నాయకులకు పీసీసీలో ప్రత్యేక స్థానం లభించడం సంతోషించదగిన విషయమన్నారు. ఈ నెల 28న పీసీసీ ప్రచార క మిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌, మహేష్‌కుమార్‌గౌడ్‌లను సన్మానించనున్నారన్నారు. నగర అధ్యక్షుడు కేశవేణు మాట్లాడుతూ జిల్లా నాయకులను పీసీసీలో ఉన్నత పదవులు అం దించినందుకు సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్‌ ఇంచార్జ్‌ తాహెర్‌బిన్‌హుందాన్‌, జిల్లా కి సాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షువు గంగారెడ్డి, శేఖర్‌గౌడ్‌, రాంభూపాల్‌, గోపి, రోహిత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-25T04:29:36+05:30 IST