NEET-PG-22 examination వాయిదాకు సుప్రీంకోర్టు తిరస్కరణ

ABN , First Publish Date - 2022-05-13T20:10:38+05:30 IST

NEET-PG-22 examinationను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు

NEET-PG-22 examination వాయిదాకు సుప్రీంకోర్టు తిరస్కరణ

న్యూఢిల్లీ : NEET-PG-22 examinationను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం తిరస్కరించింది. ఈ పరీక్షలను వాయిదా వేస్తే వైద్యులు అందుబాటులోలేని పరిస్థితికి దారి తీస్తుందని చెప్పింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం డాక్టర్లు దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది. 


NEET-PG-22 examinationను వాయిదా వేస్తే గందరగోళం, అనిశ్చితి ఏర్పడుతుందని, ఈ పరీక్షల కోసం సిద్ధమవుతున్న అత్యధిక విద్యార్థులపై ప్రభావం పడుతుందని ధర్మాసనం తెలిపింది. విద్యార్థుల్లో రెండు రకాలవారు ఉన్నారని తెలిపింది. ఒక వర్గం ఈ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతోందని, రెండో వర్గం పెద్ద సంఖ్యలో ఉందని చెప్పింది. ఈ పరీక్షలను వాయిదా వేస్తే ఎక్కువ మంది విద్యార్థులు, అంటే దాదాపు రెండు లక్షల 6 వేల మంది, ప్రభావితమవుతారని పేర్కొంది.  


పరీక్షలను సకాలంలో నిర్వహించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు సుప్రీంకోర్టు  గమనించింది. కోవిడ్-19 మహమ్మారి వల్ల పక్కదారి పట్టిన దేశం తిరిగి గాడిలో పడాలని పేర్కొంది. ఈ కోర్టు విధించిన టైమ్ షెడ్యూలును తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. 


నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET-PG), 2022ను వాయిదా వేయాలని కోరుతూ కొందరు డాక్టర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు మే 10న అంగీకరించింది. NEET-PG, 2021కోసం కౌన్సెలింగ్‌ మే 21న జరుగుతుందని, NEET-PG, 2022ను వాయిదా వేయాలని పిటిషనర్లు కోరారు. 


Read more